తెలంగాణ ప్రత్యేక కథనాలు

ఇక గ్యాస్ సిలిండర్ 500 కే.. ప్రతి ఇంట్లోకి రానున్న మరో రెండు గ్యారెంటీలు…మహిళ శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..

Written by Mohiddin Shaik

వచ్చే నెల నుంచి 500 కే వంట గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం అందించబోతోంది. అదేవిధంగా గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్న పేదలందరికీ ఉచిత విద్యుత్తును ప్రభుత్వం ఇవ్వబోతోంది.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 6 గ్యారంటీల్లో వీటితో కలిపి నాలుగు గారెంటీలు కాంగ్రెస్ సర్కారు గ్యారంటీగా అమలులోకి తెచ్చినట్లు అయింది.. మరో రెండు గ్యారెంటీలను కూడా ఆరు నూరైనా అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సవాల్ చేసి చెబుతున్నారు.

ఈ గ్యారెంటీ ల వల్ల ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా మేలు జరగనుంది. చెప్పింది చెప్పినట్టు అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం కట్టించారు సరే 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1100 కు ఎందుకు పెంచారు, అని ప్రజలను నిలదీయమని చెబుతున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ పై కృంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టుతో సహా అప్పటి వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. రైతుబంధు తో సహా పలు స్కీముల పేరుతో అర్హులైన పేదలకే కాకుండా వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని భూస్వాములకు అనర్హులకు కట్టబెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మొత్తం మీద మళ్లీ పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల మాట సర్వత్రా వినిపిస్తోంది. ఈ గ్యారెంటీలకు కచ్చితంగా ప్రజలు ఆకర్షితులయ్యారని అంశం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నూరు శాతం ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

About the author

Mohiddin Shaik

Leave a Comment