నేడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె కొత్తగూడెం పట్టణంలో జరిగే రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోణంనేని సాంబశివరావును గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు.సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆమె పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.
శుక్రవారం రాత్రికి ఖమ్మం చేరుకుంటారు ఖమ్మంలోనే ఆ రాత్రికి బస చేసి శనివారం ఉదయం ఆమె వైరా, ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో జరిగే భారీ రోడ్ షోలో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు.
పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి…
24, 25 తేదీలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…24 న మధ్యాహ్నం 12:00 గంటలకు పాలకుర్తి ,1:30 గంటలకు హుస్నాబాద్ ,అక్కడి నుండి సాయంత్రం 3:00 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…24 న ఖమ్మంలో రాత్రి బస చేయనున్న ప్రియాంక…25 న 11:00 గంటలకు ఖమ్మం,పాలేరు , 1:30 కి సత్తుపల్లి ,2: 40 నుండి 3:30 వరకు మధిర ప్రచార సభలలో పాల్గొననున్న ప్రియాంక…అక్కడి నుండి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
